కేసీఆర్ కుటుంబానికి కొసరి కొసరి వడ్డించిన రోజా..

కేసీఆర్ కుటుంబానికి కొసరి కొసరి వడ్డించిన రోజా..

మీడియా సమావేశాల్లో,సభల్లో,శాసనసభ సమావేశాల్లో ప్రత్యర్థ పార్టీ నేతలపై విమర్శలతో చెలరేగిపోవడమే కాదు వంటలు చేయడంలో,ఇంటికి వచ్చిన అథిధులను గౌరవించడం కూడా తనకు తానే సాటి అని నగిరి వైసీపీ ఎమ్మెల్యే రోజా నిరూపించుకున్నారు.రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి కాంచీపురంలోని అత్తి వరద రాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్న విషయం తెలిసిందే.కేసీఆర్‌తో పాటు రోజా కూడా వరదరాజస్వామిని దర్శించుకొని అనంతరం కేసీఆర్‌ కుటుంబ సభ్యులను ఇంటికి ఆహ్వానించిన విషయం తెలిసిందే.దీంతో ఆలయం నుంచి నేరుగా కేసీఆర్‌ కుటుంబ సభ్యులు రోజా ఇంటికి చేరుకున్నారు. కేసీఆర్ కుటుంబసభ్యుల కోసం రోజా ప్రత్యేకంగా వంటలను సిద్దం చేశారు.చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీలతో నాన్వెజ్ను మెనూలో చేర్చారు.ఆకు కూర పప్పు, వేపుళ్లు, సాంబారు, రసం, చట్నీలను వెజ్ మెనూలో ఉంచారు. దీనికి తోడు పాయసం కూడ తయారు చేశారు.రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణి కూడా కేసీఆర్ కుటుంబసభ్యులకు కొసరి కొసరి వడ్డించారు. కేసీఆర్ కుటుంబం కోసం  రోజానే స్వయంగా వంటలను సిద్దం చేసినట్టుగా సమాచారం.భోజనం చేసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ రోజాను ప్రశంసలతో ముంచెత్తారు. అన్ని రకాల వంటకాలను రుచికరంగా వండి వడ్డించారు. తన బిడ్డ మంచి ఆహారాన్ని తనకు అందించిందని కేసీఆర్ రోజాను అభినందించారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos