పేదలను అవమానించిన కేంద్రం

పేదలను అవమానించిన కేంద్రం

హైదరాబాదు: పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాలను ఉచితాలు, తాయిలాలు అంటూ కేంద్రం, బీజేపీ ప్రచారం చేయడం పేదలను అవమానించడమేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మండి పడ్డారు. పేదలకు ప్రయోజనం కలిగించే సంక్షేమ పథకాలను తాయిలాలు అంటున్న కేంద్ర ప్రభుత్వం బ్యాంకు లను దోచుకున్న కార్పోరేట్ల రుణాలను మాఫీ చేయడం ఏమిటని, దానిని ఏమనాలని ప్రశ్నించారు. పేదల ఆరోగ్యం, వారి పిల్లలకు విద్య కోసం, వ్యవసాయం కోసం అమలు చేస్తున్న పథకాలు తాయిలాలు కాదన్నారు. పేదలకు ఉచిత విద్య, విద్యుత్, ఆరోగ్యం అందించే పథకాలకు వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని సృష్టించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. వీలైతే రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సా యం చేయడం ఇష్టం లేకపోతే ఊరుకోవాలేగానీ రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపట్టడం సరికాద న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos