ప్రజావాహిని – బెంగళూరు
గుండ్లుపేట విధానసభ నియోజక వర్గంలో బండిపుర అభయారణ్యం సరిహద్దులోని ఆరు గ్రామాలకు చెందిన 262 మంది రైతులు సాగు చేసుకుంటున్న 979 ఎకరాల భూమిని కొనుక్కునేందుకు చర్యల్ని తీసుకుంటామని అటవి మంత్రి ఉమేశ్ కత్తి గురువారం విధానసభలో సభ్యుడు నిరంజనకుమార్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఇందుకోసం త్వరలో రెవిన్యూ, అటవి శాఖ ఉన్నతాధికార్ల సమావేశాల్ని నిర్వహించి తుది నిర్ణయాన్ని తీసు కుంటా మన్నారు. ఆయా ప్రాంతాల ప్రభుత్వ ధరల ప్రకారం భూముల్ని కొంటామని వివరించారు. అడవులకు చేరువలో ఉన్న భూముల్లో సేద్యం చేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారని నిరంజన్ కుమార్ వివరిం చారు.