కశ్మీర్ కు ఏమి ఒరిగింది?

కశ్మీర్ కు ఏమి ఒరిగింది?

ముంబై : ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ లో వచ్చిన మార్పులు ఏమిటో చెప్పాలని శివసేన వాణి- సామ్నా కేంద్రాన్ని
డిమాండ్ చేసింది. ‘370 ని రద్దు చేసిన తర్వాత అక్కడికి ఒక్క రూపాయి పెట్టుబడులు కూడా రాలేదు. నిరుద్యోగులకు ఉపాధి కూడా దొరకలేదు. ఈ విషయంలో స్థానికులను నేతలు పూర్తిగా తప్పుదోవ పట్టించారు. లాల్చౌక్లో తిరంగా జెండాను ఎగరవేస్తున్న కొందరు యువకులను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి. ముంబైను పీఓకేతో పోల్చిన వారికేమో కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. అదే లాల్చౌక్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసే యువకులను మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. లాల్చౌక్లో జెండా ఎందుకు ఎగరవేయకూడదో దేశ ప్రజలందరూ తెలుసుకోవాలని భావిస్తున్నారు. 370 రద్దు తర్వాత కూడా అక్కడ పరిస్థితులు ఏమీ మారలేదని ఇట్టే స్పష్టమౌతోంది. ముంబైలో త్రివర్ణ పతాకాన్నిఎగుర వేస్తారు. దీనర్థం ఇది పాక్ కాదు. పాకిస్తాన్ జోక్యం ఉన్న చోట మాత్రం త్రివర్ణ పతాకాన్ని అవమానించార’ని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos