కరోనాకు రాందేవ్ బాబా మందు

కరోనాకు రాందేవ్ బాబా మందు

హరి ద్వార్ : కరోనా నివారణ మందును పతంజలి సంస్థ మంగళవారం విపణిలోకి విడుదల చేసింది.ఈ మందు వాడితే రెండు వారాల్లో రోగి కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటారని సంస్థ యజమాని రాం దేవ్ బాబా తెలిపారు. జైపూర్ నిమ్స్ వైద్యులు, పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో 150కి పైగా ఔషధ మొక్కలను దీని తయారీకి వాడినట్లు రాం దేవ్ బాబా వివరించారు. ప్రయోగాత్మకంగా చక్కటి ఫలితాల్ని సాధించిన తర్వాతే మందును మార్కెట్లో విడుదల చేసినట్లు చెప్పారు. తమ మందు వాడిన రోగులు అందరూ కోలుకున్నారని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos