అక్బరుద్దిన్ వ్యాఖ్యల ఎఫెక్ట్..కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం..

అక్బరుద్దిన్ వ్యాఖ్యల ఎఫెక్ట్..కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం..

 తరచూ ఏదోఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓవైసీ సోదరులు వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎంఐఎం శాసనసభ సభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ తన అన్న అసదుద్దిన్‌ కంటే రెండు అడుగులు ముందు ఉంటారు.కొద్ది రోజుల క్రితం కరీంనగర్‌లో పార్టీ సమావేశంలో అక్బురద్దీన్‌ చేసిన వ్యాఖ్యలపై రేగిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది.విద్వేషాలు రెచ్చగొట్టేలా అక్బరుద్దిన్‌ వ్యాఖ్యలు చేశాడంటూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ్యాఖ్యలపై విచారణ చేపట్టారు.ఈ క్రమంలో కరీంనగర్ డీసీపీ కమలాసన్ రెడ్డి అక్బరుద్దీన్ ప్రసంగంలో ప్రతీ పదాన్ని, వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎక్సపర్ట్ ట్రాన్స్ లేషన్ కమిటీ నివేదిక ఇచ్చిందిఅక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగంలో ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు గానీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు గానీ లేవని తేల్చి చెప్పారు. ప్రసంగంపై ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం కూడా లేదని నిపుణులు పోలీసులకు సలహా సైతం ఇచ్చారు.దాంతో సీపీ కమలాసన్ రెడ్డి అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. సీపీ కేసు నమోదు చేయకపోవడంతో కరీంనగర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ప్రజల మధ్య విద్వేసాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఓవైసీపై చర్యలు తీసుకోవాలంటూ పిటీషన్ దాఖలు చేశారువిచారణ చేపట్టిన కరీంనగర్ కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఓవైసీపై ఐపీసీ సెక్షన్ 153-, 153-బి, 506, సీఆర్పీసీ 156(3) సెక్షన్లు కింద కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీంతో అక్బరుద్దీన్ ఓవైసీపై కరీంనగర్ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos