కేఏ పాల్‌పై కేసు నమోదు

కేఏ పాల్‌పై కేసు నమోదు

హైదరాబాద్‌ : ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్‌పై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. అమెరికా వెళ్లడానికి స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్న పాల్‌, ఆ మొత్తం అందగానే తన ఫోన్‌ నంబరును బ్లాక్‌ చేశారని సత్యవతి అనే మహిళ ఆరోపించింది. పాల్‌తో పాటు జ్యోతి, విజయ్‌ అనే వారికి కూడా ఇందులో ప్రమేయం ఉందని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపైనా కేసు నమోదు చేశారు. అమెరికా వెళ్లడానికి విజిట్‌ వీసా స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ ఇస్తామనే భరోసాతో రామచంద్రాపురం గ్రామానికి చెందిన సత్యవతి వద్ద పాల్‌ బృందం రూ.15 లక్షలు డిమాండ్‌ చేసింది. చివరికి రూ.2 లక్షలకు ఉభయుల మధ్య అంగీకారం కుదిరింది. మహిళ వద్ద చెక్కును తీసుకున్న పాల్‌ బృందం, డబ్బు డ్రా చేసుకుని ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos