ఆ నలుగురిని ప్రజలకు అప్పగించాలి..

ఆ నలుగురిని ప్రజలకు అప్పగించాలి..

దిశ హత్యాచార ఘటనలో నిందితులపై ప్రజల్లోనే కాదు రాజకీయ,సినీ ప్రముఖుల్లో సైతం ఆగ్రహం పెల్లుబుకుతోంది.నిందితులను వెంటనే ఉరి తీయాలని,ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్లు చేస్తున్నారు.ఈ క్రమంలో రాజ్యసభ సభ్యురాలు, అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశహత్య ఘటన తనను కలచివేసింవదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దారుణాలకు ఒడిగట్టితే అలాంటి వారికి ఇతర దేశాల్లో ప్రజలే తగిన శిక్ష వేస్తున్నారని గుర్తు చేశారు. దిశ హత్య కేసు ఘటనలో నిందితులను సైతం ప్రజలకే అప్పగించాలని డిమాండ్ చేశారు.దిశఘటన నిందితుల విషయంలో తాను కాస్త కఠినంగా రాజ్యసభలో మాట్లాడి ఉండొచ్చని కానీ అది తన ఆవేదన మాత్రమేనని జయాబచ్చన్ స్పష్టం చేశారు. నిందితులను ప్రజలకు అప్పగిస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని జయాబచ్చన్ స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos