వీళ్లసలు మనుషులేనా?

దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే సమాజం రెండు వర్గాలు విడిపోయిందా అనే భావన కలుగుతోంది.సాధారణ ప్రజలు,కొంతమంది రాజకీయ,సినీ ప్రముఖులు ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తుంటే కొంతమంది సినీ,రాజకీయ ప్రముఖులు,న్యాయవాదులు,చివరకు మహిళా సంఘాలు సైతం ఎన్‌కౌంటర్‌ను తప్పుబడుతూ విమర్శలు చేయడం,కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో రెండు వర్గాలుగా విడిపోయారనే భావన కలుగుతోంది.ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా హింసించి హత్యాచారం చేసిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం నేరమని,దారుణమని వాదిస్తుండడాన్ని ఏమనాలో తెలియడం లేదని ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక నిందితుల తల్లితండ్రులు,కుటుంబ సభ్యులు,బంధువులైతే మరో అడుగు ముందుకేసి బూతులతో రెచ్చిపోతున్నారు.తమ పిల్లలను అన్యాయంగా చంపేశారని నిందితుల తల్లితండ్రులు మాట మార్చి ఆరోపిస్తుండగా నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య లక్ష్మీ అయితే ఒక అమ్మాయి కోసం నలుగురిని అన్యాయం పొట్టన పెట్టుకున్నారంటూ వ్యాఖ్యలు చేయడం వారి ఆలోచన విధానం ఏస్థాయిలో ఉందో తెలియజేస్తోంది.ఇక నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు బంధువు అయితే దిశను కించపరుస్తూ మాట్లాడటం గమనార్హం. దిశను ఉద్దేశించి.. ఆ ల… ఎట్టాగూ చచ్చింది… అందుకని మా బిడ్డలను చంపుతారా అంటూ చాలా దారుణంగా మాట్లాడటం గమనార్హం. తెలుగు మీడియా ఛానెళ్లతో వీరు ఇలా మాట్లాడగా.. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వీళ్లు ఇలా తగలబడ్డారు కనుకనే హతమైన నలుగురు రాక్షసులు దిశను క్రూరంగా హత్యాచారం చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos