ఖరగ్పూర్: పౌర సత్వ చట్ట సవరణ ముసాయిదా, జాతీయ పౌర పట్టిక లను వ్యతిరేకించాలని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రజలకు పిలుపు నిచ్చారు. సోమవారం ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. అవి రెండూ ఒకే నాణేపు రెండు ముఖాలని అభివర్ణించారు. ‘వీటి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేం అధికారంలో ఉన్నంత వరకూ వీటికి బెంగాల్లో స్థానం లేదు. ఎన్నార్సీ పేరుతో ఈ దేశ పౌరులను వారు ఎప్పటికీ వెళ్ల గొట్టలేరు, వారిని శర ణార్థులుగా మార్చలేరు’ అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.