దాడికి సిద్ధమైన ఆత్మాహుతి దళం

దాడికి సిద్ధమైన ఆత్మాహుతి దళం

న్యూఢిల్లీ: ఉత్తరాది భారత వాయుసేన స్థావరాలపై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 10 మంది ఆత్మాహుతి దళ సభ్యులు దాడి చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. బాలాకోట్ స్థావరం తిరిగి ఆరంభం కావటంతో అధిక సంఖ్యలో ఉగ్రవాదులు సరిహద్దు వద్దకు చేరుకుంటున్నారని ఇటీ వలే పదాతి దళాధిపతి బిపిన్ రావత్ హెచ్చరించటం తెలిసిందే. బాలాకోట్ దాడులకు ప్రతీకారంగా జమ్మూ-కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని శ్రీనగర్, అమృ త్ సర్, హిండన్, అవంతిపూర్ వంటి కీలక వాయుసేన స్థావరాలపై ఆత్మాహుతి దాడికి జైషే మహ్మద్ వ్యూహాన్ని రచించింది. వాయుసేన స్థావరాల వద్ద భద్రత రెట్టింపు చేసారు. అక్కడి విద్యా సంస్థల్ని మూసివేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos