దర్శకధీరుడు రాజమౌళి అత్యంత భారీ వ్యయంతో తారక్,రామ్చరణ్ వంటి భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్కు ఎదురవుతున్న అవాంతరాలు ఇప్పట్లో తొలగేటట్లు కనిపించడం లేదు.సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి తరచూ ఏదోఒక సమస్య చిత్రబృందానికి ఎదురవుతూనే ఉంది.చిత్రంలో తారక్కు జోడీగా నటించాల్సిన డైసీ చిత్రం నుంచి తప్పుకోవడం అనంతరం తారక్,చరణ్లు గాయాలపాలవడం తారక్కు జోడీగా నటించడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడం ఇలా ఏదో ఒక అవాంతరం ఎదరవుతూనే ఉంది.తారక్ పక్కన జోడీ కోసం బాలీవుడ్ హీరోయిన్ల వేటలో పడ్డ దర్శకుడు రాజమౌళి తాజాగా జాన్వీ కపూర్ను సంప్రదించగా జాన్వీ కూడా విముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.చిత్రంలో మరో హీరోయిన్గా నటిస్తున్న అలియాభట్ పాత్రకు తన పాత్ర కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో జాన్వీ ఆఫర్ను రిజెక్ట్ చేసిందని టాక్.గతంలో జాన్వీ తల్లి దివంగత శ్రీదేవి కూడా రాజమౌళి ఆఫర్ ని రిజెక్ట్ చేశారు.’బాహుబలి’లో శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించగా పలు కారణాలతో శ్రీదేవి తిరస్కరించిన విషయం తెలిసిందే.ఇప్పుడు తల్లిలానే కూతురు కూడా రాజమౌళి సినిమా కాదనుకుందని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది.