జవాన్లకు ద్రోహం చేసిన మోది

జవాన్లకు ద్రోహం చేసిన మోది

న్యూ ఢిల్లీ: ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశాన్ని కాపాడే జవాన్ల బాగోగులను కేంద్రం పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ శుక్ర వారం ట్విట్టర్ లో ఆరోపించారు. అన్ని రంగాలనూ బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కొందరు వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. పెట్టుబడిదారుల (క్రోనీ సెంట్రిక్)బడ్జెట్తో జవాన్లకు ఒరిగేదేమీ లేదు. భారత్ని అనునిత్యం కాపాడే సైనికులకు కేంద్రం ద్రోహం చేసింది. జవాన్ల సంక్షేమానికి నిధుల కేటాయింపు ఆశాజనకంగా లేదు’అని దుయ్య బట్టారు. ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) తక్కువ వడ్డీ రుణాల ఊసే లేదని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos