కాంగ్రెస్ పార్టీ పగ్గాల్ని రాహుల్ పట్టాలి

కాంగ్రెస్ పార్టీ పగ్గాల్ని రాహుల్ పట్టాలి

న్యూ ఢిల్లీ: ‘రాహుల్ గాంధీ ఎంతో చలాకీగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎంపిక అవుతార’ని ప్రతి కాంగ్రెస్ నేత ఆకాంక్షిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్ అన్నారు. కరోనా సెకండ్ దాడి కారణంగా ఎన్నికలు జరగలేదని చెప్పారు. దేశంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా రాహుల్ మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నారు. వారందరి మనసులోని మాటనే తాను చెపుతున్నానన్నారు. ‘యంగ్ వర్సెస్ ఓల్డ్’ అనేది కేవలం మీడియా సృష్టి మాత్రమే. ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదు. ప్రతి రాజకీయ పక్షమూ ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ పోవాల్సిందే. యువ తరానికి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఎంతో అనుభవం కలిగినది. మార్గనిర్దేశం చేయగలిగిన సీనియర్లు ఉన్నారరు. యువత, సీనియర్లను కలుపుకుని పోవాలి. ఈ విషయం రాహుల్ కు కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం అనేది తాత్కాలికం కాదు. ముందు ముందూ అన్ని పార్టీలు కలసి పని చేస్తాయి. భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకమవు తున్నాయి. వచ్చే ఎన్నికల్లో భాజపాను ఎదుర్కోవడానికి ఈ పార్టీలన్నీ వ్యూహరచన చేయాల్సి ఉంది. అన్ని పార్టీలను కలుపుకుని, ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం రాహుల్ కు ఉంది. అసోం, కేరళలో అధికారంలోకి వస్తామని తాము భావించాం.అది జరగలేదు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సున్నా స్థానాలకు పరిమితమవుతామని మాత్రం ఊహించలేదు. ఏదేమైనప్పటికీ మేము ఆశాభావంతో ముందుకు సాగుతామ’ని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos