పిశాచి వైరస్‌ అసలు రూపం ఇదీ..

పిశాచి వైరస్‌ అసలు రూపం ఇదీ..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు మరింత ఉధృతంగా మారింది. వైరస్ వల్ల ఇప్పటికే వేలాది మంది మృత్యువాతపడ్డారు. లక్షలాది కేసులు నమోదయ్యాయి. అయితే, వైరస్ఆకారాన్ని పూణెలోని శాస్త్రవేత్తలు ఫోటో తీశారు. ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజింగ్ను ఉపయోగించి ఫోటో తీశారు. చిత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ప్రచురితమైంది. యేడాది జనవరి 30 దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది.చైనాలోని వూహాన్నుంచి భారత్కు వచ్చిన కేరళకు చెందిన ముగ్గురు మెడిసిన్ విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. భారత్లో నమోదైన తొలి మూడు కేసులు ఇవే. వీరి నమూనాలను పూణెలోని ప్రయోగశాలకు పంపారు. నమూనాల నుంచి కోవిడ్-19కు కారణమైనసార్స్కోవ్-2′ వైరస్ను గుర్తించి ఫొటో తీశారు. ఇది అచ్చంమెర్స్కోవ్వైరస్ను పోలి ఉంది. వైరస్ చూడడానికి కిరీటంలా కనిపిస్తుండడంతో దీనికి కరోనా అనే పేరు వచ్చింది. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం.కరోనా పరివర్తనాన్ని అధ్యయనం చేసేందుకు, జెనెటిక్మూలాలు, వైరస్ఎలా రూపాంతరం చెందుతున్నదో గుర్తించేందుకు, జంతువుల నుంచి మనుషులకు.. మనుషుల నుంచి మనుషులకు వైరస్ఎలా సంక్రమిస్తున్నదో తెలుసుకునేందుకు చిత్రాలు ఉపయోగపడుతాయని వారు వివరించారు.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos