కరోనా పుట్టుకకు కారణమై ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డ చైనా తనపై వస్తున్న ఆరోపణలతో పాటు కరోనా కారణంగా దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనా తన ఆధిపత్యం చేజారుతుందనే భయంతో భారత్ తదితర దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది.ముఖ్యంగా చైనా నుంచి అనేక కంపెనీలు భారత్తో పాటు ఇతర దేశాలకు వెళ్లిపోవడానికి సిద్ధమవుతుండడంతో ఉక్రోశం పట్టలేక భారత్పై తగువు పెట్టుకుంటోంది.దీంతోపాటు పక్కనే ఉన్న నేపాల్,పాకిస్థాన్లను సైతం భారత్పైకి ఉసిగొల్పుతోంది.ఇక చైనా-భారత్ సరిహద్దుల్లో భారీగా సైనికులను,యుద్ధ సామాగ్రి తరలించి యుద్ధానికి సిద్ధమనే సంకేతాలు పంపిస్తోంది.అందులో భాగంగా చైనా సైనికులు తరచూ భారత సైనికులతో గొడవలు పడుతూ భారత భూభాగంలోకి చొచ్చుకురావడానికి యత్నిస్తున్నారు.ఈ పరిణామాలతో ద్దాఖ్లో సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న నేపథ్యంలో ఆ దేశ సైన్యానికి దీటుగా బదులిచ్చేక్రమంలో భారత్ ఏ మాత్రం వెనక్కు తగ్గట్లేదు. చైనాతో దూకుడుగానే వ్యవహరించాలని భారత సైన్యం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.ఢిల్లీలో అగ్రశ్రేణి ఆర్మీ కమాండర్లు మూడు రోజుల పాటు సమావేశమై చైనాతో సరిహద్దుల వద్ద తాజా పరిస్థితులపై కీలక చర్చలు జరిపారు. సరిహద్దుల వద్ద చైనా బలగాలు పెద్ద ఎత్తున్న మోహరించిన నేపథ్యంలో భారత సైన్యం తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది.చైనాతో చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతలతో పాటు, జమ్మూకశ్మీర్లోని పరిస్థితులు, పలు సున్నిత అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశం అనంతరం అగ్రశ్రేణి కమాండర్లు ఓ సంక్షిప్త ప్రకటన విడుదల చేశారు. అయితే, అందులో పూర్తి వివరాలు వెల్లడించలేదు.సరిహద్దులోని పాంగాంగ్ సో సరస్సు, గాల్వన్ లోయ, డెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ వద్ద భారత సైన్యాన్ని మోహరించి, చైనాకు గట్టిగా బదులివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మాత్రం తెలిసింది. చైనా తన సైన్యాన్ని మోహరించి చేస్తోన్న ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదని నిర్ణయం తీసుకుంది.