చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్..

చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్..

సరిహద్దులో ఎదో ఒక విధంగా తగువులు పెట్టుకుంటూ చికాకు పెడుతున్న డ్రాగన్ కంట్రీకి భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. జమ్మూకాశ్మీర్‌లోని లడాఖ్ ప్రాంతాన్ని కేంద్రం… కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని తాము అంగీకరించకబోమని, అసలు లడాఖ్‌ను యూటీగా గుర్తించబోమని చైనా ప్రకటించింది. దీనిపై భారత్ గట్టి హెచ్చరిక చేసింది.నిజానికి గత కొన్ని రోజులుగా వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలను మొహరిస్తూ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న విషయం తెల్సిందే. మరోవైపు ఈనెల 13న చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మాట్లాడుతూ, లడఖ్, హిమాచల్ ప్రదేశ్‌లను భారతదేశ అంతర్గత భాగాలుగా తాము గుర్తించబోమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లడఖ్‌ను భారత్ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం కూడా చట్టవిరుద్ధమేనని అన్నారు.ఈ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అర్హత చైనాకు లేదని… పద్ధతి మార్చుకోకపోతే చైనా అంతర్గత వ్యవహారాల్లో తాము కూడా జోక్యం చేసుకుంటామని హెచ్చరించింది.భారత్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఇండియా వైఖరి ఎప్పుడూ నిలకడగా స్పష్టంగా ఉందని అన్నారు. జమ్మూకాశ్మీర్, లడాఖ్, హిమాచల్ ప్రదేశ్ ఎప్పుడూ భారత్ లో అంతర్గత భాగాలేనని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ కూడా భారత్‌లో అంతర్భాగమని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos