లాభాల్లో సూచీలు

లాభాల్లో సూచీలు

ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల వ్యాపారాన్ని ఆరంభించాయి. ఆరంభంలో 300 పాయింట్లు పెరిగిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ ఉదయం పది గంటల ప్రాంతంలో ప్రస్తుతం 379 పాయింట్ల వృద్ధితో 36,381 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 134 పాయింట్ల లాభంతో 10,741 వద్ద ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, ఐటీసీ, రిలయన్స్, ఎల్ అండ్ టీ సహా 30 షేర్ల సూచీలోని బ్యాంకింగ్ రంగ షేర్లన్నీ లాభాల్ని గడించాయి. టైటాన్, హిందూస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో షేర్లు నష్టాల పాలయ్యాయయి. రూపాయి విలువ డాలరు మారకం ధరతో పోలిస్తే రూపాయి విలువ0.2 శాతం క్షీణించి 74.81 వద్ద ఆగాయి. ముడి చమురు పీపా ధర అంతర్జాతీయ విపణిలో 0.63 శాతం పెరిగి 43.07 డాలర్లుగా ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos