మధ్యాహ్న భోజనంగా ఇడ్లీ, సాంబార్

మధ్యాహ్న భోజనంగా ఇడ్లీ, సాంబార్

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం మెనూలో మార్పులు చేసేందుకు విద్యాశాఖ ప్రయ త్నిస్తోంది. వారంలో ప్రతి గురు వారం మధ్యాహ్న భోజనానికి బదులు ఇండ్లీ సాంబార్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీన్ని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి నాలుగు ఇడ్లీలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఐదు ఇడ్లీల చొప్పున ఇవ్వనున్నట్టు మధ్యాహ్న భోజన పథకం సహాయ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. పాత పట్టిక ప్రకారం గురువారం మధ్యాహ్నం కిచిడీ, టమోట చట్నీ, ఉడికించిన కోడి గుడ్డు విద్యార్థులకు ఇచ్చేవారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos