హొసూరు : ఇక్కడి సిప్కాట్ సమీపంలోని గోవింద అగ్రహారం వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.7 లక్షలు విలువ చేసే గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం వేకువ జామున సిప్కాట్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, అటు వైపుగా వచ్చిన ఓ కారులో నిషిద్ధ గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లు
లభ్యమయ్యాయి. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి క్రిష్ణగిరికి వీటిని తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో ఉంది.