హోసూరు : స్థానిక ఎమ్మెల్యే ఎస్.ఎ. సత్య రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసి వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 36వ వార్డులోని బాలాజీ నగర్ రేషన్ షాపులో వినియోగదారుల కు ఇచ్చే నిత్యావసర సరుకుల నాణ్యత, తూనికల గురించి అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని రేషన్ షాపులో పనిచేస్తున్న సిబ్బందికి సూచించారు. అనంతరం 36వ వార్డులో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సత్య వెంట డిఎంకె పార్టీ ప్రముఖులు ఉన్నారు.