తాలిబన్ వ్యవస్థ తయారీకి కమలం కసరత్తు

తాలిబన్  వ్యవస్థ తయారీకి కమలం కసరత్తు

ముంబై : దేశంలో తాలిబన్ లాంటి వ్యవస్థను తయారు చేయడానికి భాజపా ప్రయత్నిస్తోందని శివసేన విమర్శించింది. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ పై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై శివసేన అధికారిక పత్రిక స్పందించింది. దేశంలో శాంతిని చెడగొట్టే విధంగా బీజేపీ భయంకర రాజకీయాలకు పాల్పడుతోందని సామ్నాలో తీవ్ర విమర్శలు చేశారు. రాసేవాటిని, చదివేవాటిని సెన్సార్ చేయాలని చూస్తే ‘పథర్వత్’ ఉద్యమం మరింత తీవ్ర అవుతుందని శివసేన హెచ్చరికలు చేసింది. జవహార్ రాథోడ్ రాసిన పథర్వత్ అనే కవిత సంపుటిని పవార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన పుస్తకంలోని కొన్ని వాఖ్యాలను సభకు హాజరైన వారికి చదివి వినిపించారు. ‘‘భగవాన్ బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించాడు. మనుషుల్ని సమస్తాల్ని సృష్టించాడు. అయితే ఆ భగవంతుడిని (ప్రతిమను) ఒక కూలీ తయారు చేశాడు. కవి ఇదే విషయాన్ని ప్రస్తా విస్తూ బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించినవాడా లేదంటే మనమే అతినిని సృష్టించిన వాళ్లమా (విగ్రహాలు రూపొందించడం)?’’ అని పవార్ అన్నారు. కాగా, దీనిపై పెద్ద ఎత్తున దాడికి దిగింది. పవార్ ప్రసంగానికి చెందిన వీడియోను ఎడిట్ చేసి.. పవార్ నాస్తికుడని, హిందూ ద్వేషి అని ప్రచారం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos