హైదరాబాద్: నగరంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. సైదాబాద్, మలక్ పేట, చంచల్గూడ, చాదర్ఘాట్లో వర్షం పడింది. నాంపల్లి, అఫ్జల్గంజ్, మాసబ్ట్యాంక్, మెహదీపట్నంలో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కుండపోత వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలు అప్రమత్తమయ్యాయి.