హైదరాబాదు: దిశ నిందితులను పోలీసులు ఎదురు కాల్పుల్లో హతం చేసినిందుకు ప్రొఫెసర్ హర గోపాల్ ఆక్షేపిం చా రు. శుక్రవారం ఇక్కడ ఒక మాధ్యమ సంస్థతో ఆయన మాట్లాడారు. ‘ఎవరైనా సరే నిగ్రహాన్ని కోల్పోవడం సరి కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సంయమనాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని కాదని శిక్షలు వేస్తే కొంత న్యాయం జరిగిందని భావించ వచ్చు. కానీ, ఎదురు కాల్పులు చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయి. దిశ హత్య అత్యంత ఘోరమైన ఘటనే. నేరాన్ని రాజ్య మే హత్య చేయడం సరికాదు. ఇలాంటి ఘటనల్లో నేరాన్ని న్యాయస్థానాల్లో రుజువు చేసి, అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేయవచ్చు. ప్రజలు కోరుకుంటున్నారు కదా అని ఎదురు కాల్పులు చేయటం సరి కాద’న్నారు.