వినూత్న నిరసన

వినూత్న నిరసన

తిరువనంత పురం: నిరసనలు రోజుకో రూపు దాలుస్తున్నాయి. పెళ్లి కొడుకు ఒకరు సోమ వారం వినూత్న రీతిలో నూతన పౌరసత్వ చట్టా నికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేరళ వ్యాపారి హజా హుస్సేన్ వివాహం ఇక్కడ సోమవారం జరిగింది. పెండ్లి కొడుకుగా ముస్తాబైన హుస్సేన్ తిరువంతనపురం నుంచి వివాహ వేదిక వరకూ సుమారు 20 కి.మీ. ఒంటెపై ఊరేగింపుగా వెళ్లాడు. అప్పుడు ‘సీఏఏ, ఎన్నా ర్సీ, ఎన్పీఆర్లను వ్యతిరేకిద్దాం’ అని నినాదాల్ని రాసిన అట్టల్ని చేతబట్టాడు. సీఏఏపై తన వ్యతిరేకతను ప్రదర్శించడానికే ఈ మార్గాన్ని ఎంచు కున్నానని తర్వాత తెలిపాడు. ఈ చట్టాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు. కాబోయే భార్యకు కట్నకానుక లతోపాటు రాజ్యాంగ ప్రతిని కూడా అందించడం విశేషం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos