విదేశాలకు నిత్యానంద జంప్‌..

విదేశాలకు నిత్యానంద జంప్‌..

తమ ఇద్దరు కూతుళ్లను ఆశ్రమంలో అక్రమంగా నిర్బంధించారంటూ గుజరాత్‌కు చెందిన దంపతులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న నేపథ్యంలో నిత్యానంద విదేశాలకు పారిపోయాడు. ఈ విషయాన్ని గుజరాత్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. నిత్యానంద దేశం విడిచి వెళ్లారని స్పష్టం చేశారు. జనార్ధనశర్మ దంపతులు తమ కూతుళ్లని అక్రమంగా ఆశ్రమంలో ఉంచారంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.ఈ విషయం గుజరాత్ హైకోర్టు వరకూ వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.జనార్దన శర్మ కుమార్తెలను విముక్తులను చేయడం కోసం ఆశ్రమానికి వెళ్లిన పోలీసులు ఆశ్రమంలో చేరిన తొమ్మిది నుండి పది సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు తమని హింసించారని పనిచేయాలని పది రోజులకు పైగా నగరం లో ఒక ఫ్లాట్ లో అక్రమంగా నిర్బంధంలో ఉంచారని పోలీసులకు చెప్పారు. దీంతో నిత్యానంద ఆశ్రమంలో జరుగుతున్న దారుణాల ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఆశ్రమంలో తాము చూసిన పరిస్థితిని బట్టి ఇక్కడ అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.కేసు నమోదైన విషయం తెలసుకున్న నిత్యానంద విదేశాలకు పారిపోయారని, ఆయన ఎక్కడ ఉన్నా సరే గుజరాత్ పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకుంటారని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos