విపక్షాల బంద్‌ విజయవంతం

విపక్షాల బంద్‌ విజయవంతం

హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా విపక్షాలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బంద్ పూర్తిగా విజయవంతమైందని ప్రదేశ్ కాంగ్రెస్ సమితి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ప్రభుత్వం పోలీసులతో బంద్ విఫలానికి చేసిన ప్రయత్నాలు ఫలించ లేవన్నారు. ప్రజలు మాత్రం స్వచ్చందంగా బంద్ను విజయవంతం చేశారని పేర్కొన్నారు. రాజకీయ నాయకుల గృహ నిర్బంధాలు.. అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. కార్మికులతో చర్చించాలనే ఉన్నత న్యాయస్థానం ఆదేశాన్ని బేఖాతరు చేయడం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నియంతృత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఆయనపై కోర్టు ధిక్కారణ నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఆయన మంత్రి వర్గ సభ్యులకు స్వేచ్ఛ లేదు. స్వచ్చందంగా పని చేయలేని దద్దమ్మలు. ఆర్టీసీ కార్మికుల ఉసురు కేసీఆర్కు తగులుతుంది. నియంతృత్వ వైఖరి వీడకపోతే ప్రకృతే ఆయన్ను శిక్షిస్తుంద’ని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos