దేనికి భయపడని మనుషులను సైతం ఒక్క కాటుతో డెంగీ దోమలు ఉలిక్కపడేలా చేస్తున్నాయి.ఒక్క దురలవాటు లేని చెట్టంత మనుషులను సైతం ఒక్క కాటుతో మంచాన పడేస్తూ,మనుషుల ప్రాణాలు బలి తీసుకుంటూ డెంగీ దోమలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ ప్రాణాంతక డెంగీ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాంటియాగో, వ్యాండర్బిల్ట్ వర్సిటీల శాస్త్రవేత్తలు.. కొత్త రకం దోమలను సృష్టించారు.మానవ యాంటీబాడీలతో కూడిన ఈ దోమలు జన్యు ఇంజినీరింగ్ విధానంలో సృష్టించబడ్డాయి. డెంగీ వైర్సకు లొంగని విధంగా దోమల్లో జన్యుపరమైన మార్పులు(జీఎం) చేశారు. ఆడ ఏడిస్ ఏజిప్టి దోమల ద్వారా డెంగీ వైరస్ వ్యాప్తి చెందుతుంది. మనుషుల నుంచి సేకరించిన ‘కార్గో‘ యాంటీబాడీని దోమల్లోకి పరిశోధకులు చొప్పించడంతో, వాటి శరీరంలో అది క్రియాశీలమై, డెంగీ వైరస్లు వృద్ధి చెందకుండా అడ్డుకట్ట వేస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. పరిశోధకులు సృష్టించిన కొత్త రకం దోమలు.. ఒకవేళ డెంగీ రోగుల రక్తాన్ని పీల్చితే, వాటిలోని మానవ యాంటీబాడీ క్రియాశీలకంగా మారి వైరస్ ప్రభావానికి లొంగకుండా రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఇతర వైరస్లను కూడా అడ్డుకునే దిశగా తమ ఈ పరిశోధన కీలకం కానుందని పరిశోధకులు తెలిపారు.