న్యూ ఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ ముసాయిదాకు ఓటేసినందుకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మంగళవారం శివసేన పై పరోక్షంగా ట్విట్టర్లో విమర్శించారు. ‘ఈ ముసాయిదా భారత రాజ్యాంగంపై దాడి. దీనికి ఎవరైనా మద్దతిచ్చారంటే దానర్థం దేశ పునాదిపై దాడి చేసి నాశనం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లే’ అని దుయ్యబట్టారు. గత కొంత కాలంగా ఈ ముసాయిదాను వ్యతిరేకించిన శివసేన సోమవారం హఠాత్తుగా దాన్ని సమర్థించటం గమనార్హం. దేశ ప్రజల హితం కోసమే తాము ఓటేశామని ఆ పార్టీ లోక్సభ సభ్యులు చెప్పారు.