గణపతికి కానుకగా 10 కిలోల బంగారు కిరీటం

గణపతికి కానుకగా 10 కిలోల బంగారు కిరీటం

పుణె: ప్రసిద్ధ దగ్దుశేత్ హాల్వాయ్ దేవాలయంలోని గణపతికి ఒక భక్తుడు ఏకంగా 10కేజీల బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించాడు. విలువ దాదాపు రూ. 6 కోట్లు ఉంటుందని ఆలయ సిబ్బంది తెలిపారు. ఆ కిరీటంపై విలువైన రాళ్లనూ పొదిగారు. వినాయక చవితి రోజున దీన్ని అలంకరించినట్లు తెలిపారు. భక్తుడి పేరును మాత్రం గోప్యంగా ఉంచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos