భాజపాకు భారీ ముడుపులు

భాజపాకు భారీ ముడుపులు

న్యూఢిల్లీ : 2019-20లో బిజెపికి వివిధ కంపెనీలు, వ్యక్తుల నుంచి రూ.785.77 కోట్ల మేర విరాళాలు అందాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి అందిన విరళాలకంటే ఐదు రెట్లు ఎక్కువ. భాజపాకు డిఎల్ఎఫ్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్, జిఎంఆర్ ఎయిర్ పోర్టు డెవలపర్స్ ఇతర బడా కార్పోరేట్ సంస్థలతో కూడిన ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు నుంచి రూ.217 కోట్లు, జెఎస్డబ్ల్యు గ్రూపు సంస్థలకు సంబంధించిన జనకల్యాణ్ ఎలక్టోరల్ ట్రస్టు రూ.45.95 కోట్లు, హిందాల్కోకు చెందిన సమాజ్ ఎలక్టోరల్ ట్రస్టు రూ.3.75 కోట్లు, ఎబి జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు రూ.9 కోట్లు, ఐటిసి లిమిటెడ్ నుంచి హల్దీరామ్ స్నాక్స్ వరకు అనేక కంపెనీలు బూరి విరళాలు అందించాయి. కాంగ్రెస్ పార్టీకి రూ.139.01 కోట్లు, సిపిఎంకు రూ.19.69 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్కు 8.08 కోట్లు, సిపిఐకి రూ.1.29 కోట్లు, ఎన్సిపికి రూ.59.94 కోట్లు వచ్చినట్లు ఆయా పార్టీలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. బిఎస్పి తమకు విరాళాలు అందలేదని నివేదించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos