ఆ సిరీస్ నంబర్ల నుంచి ఫోన్ వస్తే అంతే సంగతులు..

ఆ సిరీస్ నంబర్ల నుంచి ఫోన్ వస్తే అంతే సంగతులు..

ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా, సైబర్ నేరగాళ్లు అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా +92, +1, +968, +44 పాటు +473, +809, +900 సిరీస్‌లతో కూడిన ఫోన్ నంబర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ఎవరికైనా ఈ సిరీస్ ఫోన్ నంబర్ల నుంచి ఫోన్ వచ్చినపుడు తెలియకుండా ఫోన్ తీస్తే మాత్రం మీ సమస్త సమాచారం గల్లంతుకావడం ఖాయమని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.ఈ మేరకు ఓ వీడియోను రూపొందించిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు‌. రోజు రోజుకూ సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త ఎత్తుగడలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు టెలీకాం, సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించారు. కొన్ని సిరీస్‌లతో కూడిన నంబర్‌లతో ఫోన్లు చేసి ప్రజలను బురిడీకొట్టిస్తున్నారు. ప్రజలు నంబర్‌లు గుర్తించకుండా వారి స్నేహితుల ఫొటోలతో ఆ నంబర్‌లు సేవ్‌ చేస్తున్నారు.ముఖ్యంగా, +92, +1, +968, +44 నంబర్‌ సిరీస్‌లతో ఎక్కువగా నేరగాళ్లు సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్‌ మీడియాలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి ఖాతాలపై కన్నేసిన నేరగాళ్లు కొంతమందిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos