శ్రీనగర్ : అవంతిపురా రీజియన్లో సత్పోక్రాన్ ఖ్రేవ్ వద్ద మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదు రు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారో తెలియాల్సి ఉంది. సీఆర్పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపులు చేసినపుడు ఉగ్రవాదుల నుంచి కా ల్పు లు ఎదురు కావటంతో జవాన్లు కూడా ఆత్మరక్షణకు తుపాకులకు పని చెప్పారని అధికార్లు వివరించారు.