హొసూరు : కృష్ణగిరి జిల్లా డెంకణీకోట గ్రామాలలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంది. గంగా హోసూరు ప్రాంతంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు నిత్యావసరాలను పేదలకు అందిస్తున్నారు. మాజీ మంత్రి బాలకృష్ణా రెడ్డి ఆదివారం అనిశెట్టి, దేవరపల్లి తదితర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించి పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. సుమారు 40 టన్నుల కూరగాయలు బియ్యం తదితర నిత్యావసర వస్తువులను ఆయన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడిఎంకె పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, జగదీష్, ప్రభాకర్ రెడ్డి తదితర నాయకులే కాకుండా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.