గువాహటి : భారత్తో జరిగిన మహిళల తొలి టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత్, ఇంగ్లండ్ను బ్యాటింగ్కు దింపింది. ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. టామీ బ్యూమౌంట్(62), హీతర్ నైట్(40), డానిల్లీ వ్యాట్(35) చక్కగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లండ్ మంచి స్కోరును సాధించగలిగింది. భారత జట్టులో రాధా యాదవ్ రెండు, శిఖా పాండే, దీప్తి శర్మ చెరో వికెట్ తీశారు. 161 పరుగుల లక్ష్యంతో దిగిన భారత జట్టు 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. శిఖా పాండే (23), దీప్తి శర్మ (22) మినహా ఇంకెవరూ రాణించలేదు. ఈ విజయంతో ఇంగ్లండ్ టీ20 సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.