హొసూరులో ఆక్రమణల తొలగింపు

హొసూరులో ఆక్రమణల తొలగింపు

హొసూరు : ఇక్కడికి సమీపంలోని మత్తిగిరిలో ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను అధికారులు తొలగించారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి భవనాలు నిర్మించడానికి పునాదులు తవ్వారని హొసూరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించడానికి చర్యలు చేపట్టారు. హొసూరు-మత్తిగిరి రోడ్డులో జేసీబీల ద్వారా పునాదులను పెకిలించివేశారు. మరికొన్ని చోట్ల కూడా ఆక్రమణలను తొలగిస్తామని రెవెన్యూ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos