హొసూరు : కృష్ణగిరి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రచారం ఊపందుకుంది. హొసూరు యూనియన్లో అభ్యర్థులు కరపత్రాలు పంచుతూ, ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హొసూరు సమీపంలోని మినీ పారిశ్రామికవాడ గా పేరొందిన బాగలూరులో సర్పంచ్ పదవులకు పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అందులో భాగంగా ఏడీఎంకే పార్టీ నాయకుడు వీడీ. జయరామ్ తన ఎన్నికల చిహ్నమైన
నిచ్చెనను ఓటర్లకు పరిచయం చేస్తూ, ప్రచారం చేశారు. బాగలూరులో కరపత్రాలు పంచుతూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. తేరుపేట, కోటవీధి బస్టాండు తదితర ప్రాంతాలలో కరపత్రాలు పంచుతూ తన మద్దతుదారులతో ప్రచారం చేశారు.