30 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

30 ప్రాంతాల్లో  ఈడీ సోదాలు

న్యూ ఢిల్లీ : దిల్లీ ప్రభుత్వ మద్యం కుంభ కోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశంలోని 30 ప్రదేశాల్లో సోదాలు చేపట్టాయని అధికార వర్గాలు తెలిపాయి. దిల్లీ, దిల్లీ, గురుగ్రామ్, లఖ్నవూ, హైదరాబాద్, ముంబయి, బెంగళూరులో మద్యం వర్తకులు ఉండే ప్రాంతాల్లో దాడులు కొనసాగు తున్నాయి. ప్రధాన నిందితుడు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ఇంట్లో దాడులు చేయడం లేదు. దిల్లీ, జోర్బాగ్లోని ఇండో స్పిరిట్స్ కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రుకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయన యూసీఓ బ్యాంకు నుంచి రూ. కోటి బదిలీ చేసారని ఈడీ ఆరోపించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos