భాజపాకు టాటాల భూరి విరాళం

భాజపాకు టాటాల భూరి విరాళం

న్యూఢిల్లీ: పాలక పక్షం- భాజపాకు 2018-19లో వివిధ సంస్థలు, ట్రస్టుల నుంచి రూ.700 కోట్లు విరాళాలు అందాయని ఆ పార్టీ మంగళవారం వెల్లడించింది. చెక్కులు, ఆన్లైన్ చెల్లింపుల రూపంలో అవి అందినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో తెలిపింది. విరాళాల్లో దాదాపు సగం టాటాసన్స్ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్టు నుంచి రావడం గమనార్హం. ఈ ట్రస్టు నుంచి రూ.356 కోట్లు సమకూరాయి. ఇక భారత్లో అత్యంత సంపన్న ట్రస్టు అయిన ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు రూ.54. 25 కోట్లు ఇచ్చింది. భారతీ గ్రూప్, హీరో మోటార్కార్ప్, జుబిలియంట్ ఫుడ్ వర్క్స్, ఓరియెంట్ సిమెంట్, డీఎల్ఎఫ్, జేకే టైర్స్ లాంటి ఇతర కార్పొరేట్ సంస్థలు భాజపాకు విరాళాలు అందించిన వాటిలో ఉన్నాయి. రూ.20వేలు, అంతకు మించిన విరా ళా లను కేవలం ఆన్లైన్లోనే స్వీకరించినట్లు భాజపా తెలిపింది. ఇందులో ఎలక్టోరల్ బాండ్ల నుంచి వచ్చిన మొత్తాన్ని చేర్చలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos