ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్కు మందు కనిపెట్టామంటూ బెంగళూరుకు చెందిన ఓ వైద్యుడు వెల్లడించడం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. భయంకరమైన కరోనా వైరస్ కు మందు కనుగొన్నానని బెంగళూరుకు చెందిన వైద్యుడు విశాల్ రావు తెలిపారు. కానీ అది ఫస్ట్ స్టేజీలో ఉందని వివరించారు.ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అంకాలజిస్ట్ గా పనిచేస్తున్న విశాల్రావు యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్కు మందు కనుక్కొన్నామని తెలిపారు. వైరస్ ప్రబలిన రోగుల్లో సైటోకిన్ ను రోగుల్లో ఇంజెక్ట్ చేస్తామని ఇది వైరస్ నిర్మూలన ప్రారంభ దశ అని.. వారంలోగా తుది దశకు చేరుకుంటామని వివరించారు. వైరస్ నివారణ మందు పరీక్షకు అనుమతించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్టు తెలిపారు. తయారు చేసిన ఈ మెడిసిన్ కి ప్రభుత్వం అనుమతి ఇచ్చి పరిశోధన జరిగితే గానీ అందుబాటులోకి రాదు. విశాల్ రావు ప్రయోగం విజయవంతం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అలాగే విశాల్ రావుకి సపోర్ట్ చేసేందుకు మిగతా వైద్యులు కూడా ముందుకురావడం శుభపరిణామం.