న్యూ ఢిల్లీ: వీలైనంత త్వరగా నాయకత్వ సమస్యను పరిష్కరించక పోతే పార్టీకి భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శశి థరూర్ సోమవారం ట్విట్టర్లో హెచ్చరించారు. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను తిరిగి చేపట్టదలచుకుంటే వెంటనే ఆ పని చేయాలని సూచిం చారు. ఇష్టం లేకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేయాలని కోరారు. లేకుంటే పార్టీ మనుగడకే ప్రమాదం కలుగుతుందని ఆక్రోశించారు. ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన సందర్భంగా మురికి వాడలు కనిపించకుండా గోడ కట్టడాన్ని తప్పు బట్టారు.