మాపార్టీని నాశనం చేస్తామన్నవారంతా పత్తాలేకుండా పోయారు..

మాపార్టీని నాశనం చేస్తామన్నవారంతా పత్తాలేకుండా పోయారు..

చెన్నై: డీఎంకేను నాశనం చేయాలనుకొనేవారంతా పత్తా లేకుండా పోయారని మంత్రి కేఎన్‌ నెహ్రూ చెప్పారు. మదురైలో బడ్జెట్‌ ప్రధానాంశాలు తెలియజేసేలా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి మాట్లాడుతూ… సీఎం స్టాలిన్‌ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నా రన్నారు. మహిళలకు సాధికారిక నిధిగా నెలకు రూ.1,000, ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థినులకు నెలకు రూ.1,000 తదితర పథకాలు అమలు చేస్తూ, దేశంలోని ఉత్తమ ముఖ్య మంత్రిగా పేరుగాంచారని అన్నారు. రాష్ట్రానికి నెలకోసారి వస్తున్న ప్రధాని మోదీ, మరో ఎన్నికల సమయానికి డీఎంకే  ఉండదని మాట్లాడుతున్నారని, డీఎంకేను నాశనం చేయాలనుకున్న ఎందరో కనుమరుగయ్యారన్న విషయం మోదీ గుర్తెరగాలన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే కూటమి 40 స్థానాల్లో విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos