చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా..?

చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా..?

విజయవాడ: ‘చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా..? ఉంటే గుండెపై చేయి వేసుకుని చెప్పాల’ని ఆ పార్టీ మాజీ అధికార ప్రతినిధి దివ్యవాణి వ్యాఖ్యానించారు. ఆమె గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. తనకు జరిగిన అన్యాయంపై ఉద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు.
‘టీడీపీలో ఏడాదిగా నాకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. కొందరు మహిళా నేతలు ఫోన్ చేసి తిట్టారు. కొందరు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. ప్యాకేజీ అందినందుకే రాజీనామా చేయట్లేదన్నారు. నేను ఎవరికీ ఎప్పుడూ భజన చేయలేదు.. చేయను. పార్టీలో ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నా సమస్యను లోకేశ్ దృష్టికి తీసుకెళితే.. జనార్ధన్కు చెప్పమన్నారు. కొందరు ఇడియట్స్ జర్నలిజం పేరుతో నానా మాటలు అన్నారు. చివరి నిమిషం వరకు క్లారిటీ తీసుకునేందుకే ఆగాను. ఇలాంటి రోజు వస్తుందని భావించలేదు. చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా..? ఉంటే గుండెపై చేయి వేసుకుని చెప్పాలి. నేను చెప్పాల్సిన పాయింట్లు వేరే వాళ్లతో చెప్పించారు. మీటింగుల్లో ఎవరితో మాట్లాడించాలో ముందు అనుకుని మాట్లాడిస్తారు. మహానాడులో నన్ను మాట్లాడనివ్వకుండా అవమానించారు. పదవుల కోసం నేనెప్పుడూ ప్రాకులాడలేదు. టీడీ జనార్దన్ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకు నరకం చూపిస్తారా..? పార్టీలో నా స్థానం ఏంటో తెలియని పరిస్థితి ఉంది’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos