ఆరు నూరైనా విభజన ఆగదు

ఆరు నూరైనా విభజన ఆగదు

అమరావతి: విపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుట్రలు పన్నినా చేసినా రాజధాని వికేంద్రీకరణ చేసి తీరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం ఇక్కడ విలేఖరులతో ఆయన మాట్లాడారు. ‘చంద్రబాబు నాయుడు చెప్పి నట్టే మండలి ఛైర్మన్ వ్యవహరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, కుట్రలు చేసినా మా ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తాం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పంపిన ముసాయిదాను అడ్డు కోవడం విచారకరం. మండలిలో తెదేపా సభ్యుల తీరు అభ్యంతర కరం. ఈ పరిణామాల వల్ల కొంత జాప్యం జరగొచ్చు కానీ అమలు చేసి తీరుతాం. రాష్ట్రంలో అలజడి సృష్టించాలన్నది చంద్ర బాబు ఆలోచన’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos