ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం ఒడుదొడుకులతో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిముషాల ప్రాంతంలో సెన్సెక్స్ 36,488 పాయింట్ల వద్ద, నిఫ్టీ 10,760 వద్ద ఉన్నాయి. మదుపర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇవ్వటం విపణి ఒడుదుడుకులకు మూల కారణం. బజాజ్ ఫినాన్స్, ఎల్&టీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, మారుతీ షేర్లు లాభాల్లో, పవర్గ్రిడ్, ఎం&ఎం, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.