అభివృద్ధి పనుల్లో హోసూరు యూనియన్ చైర్‌పర్సన్ బిజీ

అభివృద్ధి పనుల్లో హోసూరు యూనియన్ చైర్‌పర్సన్ బిజీ

హోసూరు : యూనియన్ చైర్‌పర్సన్ శశి వెంకటస్వామి అభివృద్ధి పనుల భూమి పూజలతో బిజీబిజీగా గడిపారు. హోసూరు యూనియన్ ఇచ్చంగూరు పంచాయతీలోని కొత్తపల్లి నుండి కొడియాలం వరకు రూ.86 లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మించే తారు రోడ్డు నిర్మాణానికి గాను శశి వెంకటస్వామి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్ రవికుమార్, ఇచ్చంగూరు చంద్రారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు. అదేవిధంగా హోసూరు యూనియన్ మాచినాయకనపల్లి పంచాయతీలోని మూడు గ్రామాలలో రూ.50 లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మించే సిమెంట్ రోడ్లు, చెరువు కాలువ మరమ్మతు పనులకు గాను శశి వెంకటస్వామి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎడిఎంకె పార్టీ నాయకులు సురేష్ రెడ్డి, మాచినాయకనపల్లి, ఎటి.ముదగానపల్లి, పంచాక్షపురం గ్రామస్థులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos