భారత్ అంతర్జాల వేదికలు అదృశ్యం

భారత్ అంతర్జాల వేదికలు అదృశ్యం

బీజింగ్: చైనాలో భారత వెబ్ సైట్లు చూసేందుకు వీల్లేకుండా అక్కడి ప్రభుత్వం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) సర్వర్ల వ్యవస్థను నిలిపివేసింది. భారత టీవీ చానళ్లు చూడాలంటే ఐపీ టీవీ ఒక్కటే మార్గమని ఇక్కడి భారత దౌత్య వర్గాలు తెలిపాయి. అక్కడి కేబుల్ న్యూస్ వ్యవస్థలో భారత టీవీ చానళ్లు వీక్షించజాలరు. చైనాలో వార్తా ప్రసారాలపైనా, ప్రసార సంస్థలపైనా విపరీతమైన సెన్సార్ ఉంది. వీపీఎన్ వంటి నెట్వర్కింగ్ టూల్స్ లేకుండా వెబ్ సైట్లు వీక్షించడం కుదరని పని. చైనా తనకు అభ్యంతరకరం అని భావించిన వెబ్ సైట్లను, టీవీ చానళ్లను ఇంటర్నెట్లో చూసేందుకు వీల్లేకుండా వీపీఎన్ ను నిలువరించే అద్బుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. ఉదాహరణకు చైనాకు హాంకాంగ్ నిరసనలు నచ్చదు. బీజింగ్ లో ప్రసారమయ్యే సీఎన్ఎన్, బీబీసీ వంటి అంతర్జాతీయ చానళ్లలో ‘హాంకాంగ్’ అనే పదం రాగానే స్క్రీన్ మొత్తం బ్లాంక్ గా మారిపోతుంది. ‘హాంకాంగ్’ అనే పదానికి సంబంధించిన వార్తాంశం అయిపోయేంత వరకు స్క్రీన్ ఖాళీగా దర్శనమిస్తుంది. ఇలాంటి హైటెక్ ఆవిష్కరణలకు చైనా పెట్టింది పేరు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos