చెరువులో పూడిక తొలగింపు ప్రారంభం

చెరువులో పూడిక తొలగింపు ప్రారంభం

హోసూరు : ఇచ్చంగూరు పంచాయితీ చొక్కనాథపురం గ్రామంలోని చెరువులో రూ.10.60 లక్షల ఖర్చుతో పూడిక తొలగింపు పనులను హోసూరు యూనియన్ చైర్‌పర్సన్ శశి వెంకటస్వామి ప్రారంభించారు. హోసూరు యూనియన్లో పలు చెరువులలో పూడిక తొలగింపు పనులను జోరుగా సాగిస్తున్నారు. అందులో భాగంగా ఇచ్చంగూరు పంచాయతీలోని చొక్కనాథపురం గ్రామం లోగల చెరువులో పూడిక తీయించాలని గ్రామస్థులు చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్థుల కోరిక మేరకు చెరువులో పూడిక తీసేందుకు రూ 10.60 లక్షలు నిధులను కేటాయించారు. శశి వెంకటస్వామి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇచ్చంగూరు పంచాయితీ అధ్యక్షులు పద్మావతి చంద్రశేఖర్, జిల్లా కౌన్సిలర్ రవి కుమార్, గ్రామస్థులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos