అధికారి కుక్క వాకింగ్ కోసం

అధికారి కుక్క వాకింగ్ కోసం

న్యూ ఢిల్లీ : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్పై.. సోషల్ మీడియాలో తాజాగా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక అధికారి తన కుక్కతో వాకింగ్ చేసేందుకు వీలుగా స్టేడియం వేళల్ని సవరించారని మండిపడుతున్నారు. ఢిల్లీలో స్టేడియాల వేళల్ని పొడిగించింది కేజ్రీవాల్ సర్కార్. రాత్రి పది గంటలకు వరకు అథ్లెట్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీని ఆంతర్యం విమర్శలకు దారి తీసింది. త్యాగరాజ స్టేడియంలో ఓ ఐఏఎస్ అధికారి పెంపుడు కుక్కతో నిత్యం వాకింగ్కు వెళుతున్నాడు. ఆ వేళలో అథ్లెట్లకు ప్రాక్టీస్ చేసుకునే సమయాన్నిఅధికార్లు తగ్గించారు. త్వరగా వెళ్లిపోవాలని సూచి స్తున్నారు. దీంతో విమర్శలు వెల్లువెత్తటంతో రాత్రి పది గంటల వరకు స్టేడియాలను తెరిచి ఉంచాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos