న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో సంభవించిన అల్లర్లలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. మంగళ వారం సాయంత్రం వరకూ 13 మంది కన్నుమూసారు. బుధవారం ఉదయానికి క్షతగాత్రుల్లో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు గురు తేగ్ బహదూర్(జీటీబీ) ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నూతన పౌరసత్వ చట్ట(సీఏఏ) వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు ఈ మరణాలకు కారణం. ఈ పరిణామాలపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్.మురళీధర్ నివాసంలో గత అర్ద రాత్రి అత్యవసర విచారణ జరిగింది. ఘర్షణల్లో గాయ పడిన వారికి అత్యవసర చికిత్స అందించాలని పోలీసులను ఆదేశించింది. చికిత్సపై నివేదిక సమర్పించాలని కోరింది.